ఈనాటికవిత-14
___________________________
కొరటమద్దివాణి-ప్రశ్న
___________________________
కొరటమద్దివాణి-ప్రశ్న
"ఆశాబద్ధతే జంతు:కర్మణా బహుచింతయ:" అని భారతీయవేదాంతులు చెప్పారు.జీవితాన్ని సుఖవంతంగా ,సంతృప్తిగా గడపడానికి మనిషి కొన్ని ఆలోచనలు చేస్తాడు..కాని ఒక్కోసారి అవి సత్ఫలితాలను ఇయ్యకపోవచ్చు.దానివల్ల నిరాశ కలుగుతుంది.ఆనందం ఆశ ఫలవంతమవటం వల్ల కలుగుతుంది.ఆ ఆనందం నైతికప్రయోజనాలను సమకూరుస్తుందని అంటాడు బెంతం.(Bentheam.Jeremy)ఈ ఆనందంకోసం తాపత్రయపడనివారుండరు.ఆశకు నిరాశకు మధ్య కలిగేప్రశ్నలను,సంధిగ్ధతను కొరటమద్ది వాణి కవిత్వం చేసారు.ఆలోచనలవల్ల కలిగే నిద్రలేమి నుంచి కవితప్రారంభమవుతుంది.ఎత్తుగడే విఫలం తరువాతి స్థితినుంచి మొదలవుతుంది.
"నిద్రలేని రాత్రులు వెక్కిరిస్తూనే వున్నాయి
కురుస్తున్న కన్నీళ్ళు
మనసు తడి ఆరనివ్వడంలేదు
ఆశలన్నీ మూటకట్టుకుని మూల నుండి పోయాయి
కొత్త జీవితానికి పునాదులేయ్యాలనిపిస్తుంది"
కురుస్తున్న కన్నీళ్ళు
మనసు తడి ఆరనివ్వడంలేదు
ఆశలన్నీ మూటకట్టుకుని మూల నుండి పోయాయి
కొత్త జీవితానికి పునాదులేయ్యాలనిపిస్తుంది"
ఈ వాక్యాల్లో మనోవైజ్ఞానిక సుఖవాదం(Psychological hedonism)ఉంది.మిల్(Mill.John Stuart)ఇందులో ప్రముఖుడు.కవిత ఆసాంతం ఈ ప్రభావం ఎక్కువే.మిల్ దీన్ని సాధారణ సుఖవాదమని అన్నాడు .దానికి కారణం మానవుడు ఎప్పుడు ఏదో కాంక్షలో నే ఉంటాడని ఆయన భావన. కాంక్ష,సుఖం ఈ రెండు ఒకే దృష్టాంతంలోని రెండురీతులని మిల్ అన్నాడు.
1.కాసిని స్వప్నాలను కలుపుకుంటూ
మనసును ప్రక్ష్యాళన చేసే ప్రయత్నం చేస్తాను
1.కాసిని స్వప్నాలను కలుపుకుంటూ
మనసును ప్రక్ష్యాళన చేసే ప్రయత్నం చేస్తాను
2.తగులుతున్న తడిని
నిండిన గుంటల్ని చూస్తూ
మది ప్రశ్నల వర్షం కురిపిస్తూ వుంటుంది
నిండిన గుంటల్ని చూస్తూ
మది ప్రశ్నల వర్షం కురిపిస్తూ వుంటుంది
కాంక్ష,ఆశ అనేపదం లక్ష్యసంబంధమయింది.ఈ మార్గంలో మనసు లక్ష్యాన్ని కాంక్షిస్తుంది కాని,సుఖాన్ని కాదని -సిడ్ఫ్ నిక్ అంటాడు.ఆశ గురించే ఆలోచిస్తుంటే అది దూరం కావొచ్చు దీనిని ఆయన సుఖవిరోధాభాస(Paradox of hedonism)అన్నాడు.వాణి కొరటమద్ది కవిత్వంలో ఈ భావన కూడా కనిపిస్తుంది.ఈ వాక్యాలు అందుకు ఉదాహరణ.
"సాధ్యం కాని సౌధాలు ఎలా నిర్మిస్తావని ?
ఊరుతున్న నీళ్ళలో ఊహలభవనమెలా?
అడియాశల శిఖరాలు అవసరమా?
సర్దుకోమంటూ మనసు హెచ్చరిస్తూనే వుంటుంది
మౌనంగా వుండిపోయాను
చేజారిన చిరునవ్వులు మరల రావనిపించి
మానని గాయాన్ని మది మరువలేదనిపించి."
ఊరుతున్న నీళ్ళలో ఊహలభవనమెలా?
అడియాశల శిఖరాలు అవసరమా?
సర్దుకోమంటూ మనసు హెచ్చరిస్తూనే వుంటుంది
మౌనంగా వుండిపోయాను
చేజారిన చిరునవ్వులు మరల రావనిపించి
మానని గాయాన్ని మది మరువలేదనిపించి."
కవితా నిర్మాణానికి సంబంధించి రెండు యూనిట్ లు రూపకాత్మకంగా కనిపిస్తాయి.నీళ్లు ఊరటం -కష్టాలు కలగటం.ఇవన్నీ నిర్మాణంలో భాగంగా కనిపిస్తాయి.
"నేత్రాల చెరువులు
నిరాశల నీళ్ళు నిండా నింపుకుని వుంటాయి
జీవితాన్ని మార్చాలని ఆరాట పడుతూనే వుంటాను
తవ్వే కొద్దీ ఊరుతున్న నీళ్ళను ఆపలేక పోతాను
ఆశల ఇటుకలను పేర్చాలనే ప్రయత్నం
చేస్తూనే వుంటాను
తగులుతున్న తడిని
నిండిన గుంటల్ని చూస్తూ
మది ప్రశ్నల వర్షం కురిపిస్తూ వుంటుంది"
"నేత్రాల చెరువులు
నిరాశల నీళ్ళు నిండా నింపుకుని వుంటాయి
జీవితాన్ని మార్చాలని ఆరాట పడుతూనే వుంటాను
తవ్వే కొద్దీ ఊరుతున్న నీళ్ళను ఆపలేక పోతాను
ఆశల ఇటుకలను పేర్చాలనే ప్రయత్నం
చేస్తూనే వుంటాను
తగులుతున్న తడిని
నిండిన గుంటల్ని చూస్తూ
మది ప్రశ్నల వర్షం కురిపిస్తూ వుంటుంది"
తాత్వికమైన భావనతో ఒక సంఘర్షణను కవితగా మలిచారు.కొన్ని పదబంధాలు కూడా అంతే తాత్వికంగా కనిపిస్తాయి.-"ఆశల ఇటుకలు,నేత్రాల చెరువులు,నిరాశల నీళ్ళు,అడియాశల శిఖరాలు"- లాంటివి ఆమార్గంలో కనిపిస్తాయి.ఒక వస్తువును భావనను కవితగా మార్చడానికి ఎంత ప్రయత్నం కావాలో ఈ కవిత చెబుతుంది.

No comments:
Post a Comment